యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః ।
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ।। 11 ।।
యత్ — ఏదైతే; అక్షరం — వినాశము చెందనిది; వేద-విదః — వేద పండితులు; వదంతి — వివరిస్తారు; విశంతి — ప్రవేశిస్తారు; యత్ — ఏదైతే; యతయః — గొప్ప ఋషులు; వీత-రాగాః — మమకార-ఆసక్తి లేకుండా; యత్ — ఏదైతే; ఇచ్చంతః — కోరుతూ; బ్రహ్మచర్యః — బ్రహ్మచర్యము; చరంతి — ఆచరిస్తారు; తత్ — అది; తే — నీకు; పదం — లక్ష్యము; సంగ్రహేణ — క్లుప్తంగా; ప్రవక్ష్యే — నేను వివరిస్తాను.
BG 8.11: వేద పండితులు ఆయనను నాశము (క్షయము) చెందని వాడు అని చెప్తారు; ఆయనలో ప్రవేశించటానికి, మహోన్నత ఋషులు బ్రహ్మచర్యము పాటిస్తూ, ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు. ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తముగా విశదపరుస్తాను.
యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః ।
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ।। 11 ।।
వేద పండితులు ఆయనను నాశము (క్షయము) చెందని వాడు అని చెప్తారు; ఆయనలో ప్రవేశించటానికి, మహోన్నత ఋషులు బ్రహ్మచర్యము పాటిస్తూ, ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు. ఇప్పుడు ఆ …
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
వేదములలో భగవంతుడు ఎన్నో పేర్లతో పిలవబడ్డాడు. వాటిలో కొన్ని: సత్, అవ్యాకృత్, ప్రాణ్, ఇంద్ర, దేవ, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్, మరియు పురుష్. ఎన్నో చోట్ల, భగవంతుని నిరాకార తత్త్వాన్ని సూచించేటప్పుడు, ఆయన 'అక్షర' అన్న పేరుతో కూడా పిలవబడ్డాడు. అక్షర అంటే 'నాశము లేనిది' అని అర్థం. బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:
ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమసౌ విధృతౌ తిష్ఠతః (3.8.9)
‘అక్షరుడైన వాని బ్రహ్మాండమైన శక్తి చేతనే సూర్యుడు, చంద్రుడు తమ స్థానాల్లో నిలుప బడుతున్నారు.’ ఈశ్వరుని నిరాకార తత్త్వాన్ని పొందటానికి, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో, యోగ-మిశ్ర-భక్తిని వివరిస్తున్నాడు. సంగ్రహేణ అంటే ‘క్లుప్తంగా’ అని అర్థం. మరీ అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఈ మార్గాన్ని, ఆయన క్లుప్తంగా మాత్రమే వివరిస్తున్నాడు ఎందుకంటే ఈ మార్గము అందరికీ అనుకూలమైనది కాదు.
ఈ మార్గంలో వ్యక్తి చాలా తీవ్రమైన నియమనిష్ఠలను పాటించాలి, ప్రాపంచిక కోరికలని వదిలి వేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, మరియు ఖచ్చితమైన ఇంద్రియనిగ్రహము అలవర్చుకోవాలి. బ్రహ్మచర్యము ద్వారా వ్యక్తి యొక్క శారీరక శక్తి సంరక్షించబడి, ఆ తరువాత సాధన ద్వారా అది ఆధ్యాత్మిక శక్తిగా మార్చబడుతుంది. ఆధ్యాత్మిక విషయాలను అవగతం చేసుకోవటానికి, బ్రహ్మచర్యాన్ని పాటించే సాధకుడు, తన జ్ఞాపక శక్తిని మరియు బుద్ధి కుశలతను పెంచుకుంటాడు. ఈ విషయం ఇంతకు పూర్వమే 6.14వ శ్లోకంలో వివరంగా చెప్పబడినది.